VijayaKumar

Apr 17 2024, 12:55

చికిత్స పొందుతూ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్ వయసు 12 సంవత్సరాలు మంగళవారం రాత్రి మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి కి చెందిన మహేష్ కుమారుడు ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈనెల 12న కలుషిత ఆహారం వలన విద్యార్థులు అస్వస్థకు గురైనారు. మెరుగైన చికిత్స కోసం ప్రశాంత్ ను 13వ తేదీ హైదరాబాద్ కి తరలించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనకు బాధ్యులుగా భువనగిరి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేస్తూ గురుకులాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

VijayaKumar

Apr 16 2024, 20:34

భువనగిరిలో స్వర్ణగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని డిసిపికి వినతిపత్రం అందజేసిన బీసీ విద్యార్థి సంఘం


భువనగిరి DCP రాజేష్ చంద్ర సార్ని ఆఫీసులో కలిసి పలు విషయాలపై వినతిపత్రం ఇచ్చిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ స్వర్ణగిరి బోనగిరి ఎల్లమ్మ టెంపుల్ బైపాస్ వద్ద ప్రజలు రోడ్డు కాస్ చేసేటప్పుడు ప్రమాదానికి గురవుతున్నందున పోలీస్ పికెట్ ట్రాఫిక్ పోలీస్లను వీకెండ్ లో 20 నుండి 30 వేల భక్తులు రాకపోకలు ఉన్నందున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా చూడాలని ఎలక్షన్లో ఎక్కువలోనికి గురవుతున్న గ్రామాలలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని జిల్లాలో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని రాత్రి వేళల్లో గ్రామాలలో దోపిడీకి గురవుతున్నందున పోలీసులను పెట్టాలని పలు విషయాలపై మాట్లాడిన తనంతరం డీసీపీ సార్ స్పందిస్తూ తప్పకుండా బైపాస్ వద్ద ట్రాఫిక్ పోలీసులను పెడతామని ఎలక్షన్ లోనికి గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాత్ ఏర్పాటు చేశామని దోపిడి దొంగలను పట్టుకుని ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాం అన్నారు DCP గారికి ధన్యవాదాలు తెలిపిన బీసీ విద్యార్థి సంఘం *ఈ సమావేశంలో యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుండెబోయిన సురేష్ యాదవ్ , బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోటేశ్వరి, బిజెపి నాయకులు సురేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన శంకర్,తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 19:24

సొంతగూటికి చేరిన ఎంపీటీసీ సామ రామ్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ముద్దాపురం కు చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,  

వేములకొండ ఎంపిటిసి సామ రాం రెడ్డి అసంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరారు. మంగళవారం తిరిగి తన అనుచర గనంతో భారీ సంఖ్యలో భువనగిరిలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన సుమారుగా 200 మందితో భువనగిరి డాల్ఫిన్ హోటల్లో స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నూతి రమేష్, జడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి, పాశం సతి రెడ్డి, కేశిరెడ్డి నీరజారెడ్డి,పల్లెర్ల సుధాకర్, పులిపలుపుల రాములు, వెంకట్ రెడ్డి, సామ చంద్రారెడ్డి, సూదిని నర్సింహా, సామ వెంకట్ రెడ్డి

తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 19:01

నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం అంగన్వాడి కేంద్రంలో ఘనంగా అన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ జి వాణిశ్రీ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు, తల్లులు, బాలింతలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకోవాలని అన్నారు.

అంగన్వాడి టీచర్ సక్కుబాయి పిల్లలకు ఇంగ్లీషు ,తెలుగు అక్షరమాల, అంకెల పరిచయాలు, పాటలు పిల్లలతో చేయించి తల్లులకు చూపించడం జరిగినది. పిల్లలకు మూడు నెలకు ఒకసారి అసైన్మెంట్ కార్డులలో పిల్లలు చేసిన యాక్టివిటీస్ మీద స్టార్స్ గుర్తించి వారికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా నరసమ్మ, పిల్లల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 16 2024, 18:08

ఈనెల 19న భువనగిరిలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు

 ఈనెల 19న సిపిఎం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి యండి. జహంగీర్ గారి నామినేషన్ సందర్భంగా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రోడ్ షో కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ సిపిఎం శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుపరం చేస్తూ దేశ ఐక్యతను దెబ్బతీస్తూ భారత రాజ్యాంగాన్ని ప్రజలకు ఉన్న హక్కులను సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తెచ్చి పరిపాలన చేయాలని చూస్తున్నదని ఈ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించి ఈ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టడం తప్ప వారికి చేసిన పనులు ఏమీ లేవని ఈ రెండు పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడింది ఏమీ లేదని అందుకనే ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ లను ఓడించి నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్నాయి ఎర్రజెండా ఎర్రజెండా అభ్యర్థి ఎండి జాహంగీర్ ని గెలిపించాలని కోరినారు. 19 నాటి రోడ్ షో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ పొలిటి బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, జి. నాగయ్య, రాష్ట్ర రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు

ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి , పోతినేని సుదర్శన్, టి. జ్యోతి, డిజి. నరసింహారావు, చుక్క రాములు, పాలడుగు భాస్కర్ , జాన్ వెస్లీ , టి. సాగర్ ,మల్లు లక్ష్మి , ఎండి అబ్బాస్, పి. ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారని నర్సింహ తెలియజేసినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ, మాజీ సర్పంచ్ రాసాల నిర్మల, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ , కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు రాసాల వెంకటేష్, శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, సభ్యులు మధ్యపురం బాల నర్సింహ, మచ్చ భాస్కర్, ఉడుత వెంకటేష్, ఎంఏ. రైహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

          

VijayaKumar

Apr 16 2024, 18:00

జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా కొడారి వెంకటేష్ నియామకం


 జవహర్ బాల్ మంచ్ యాదాద్రి భువనగిరి జిల్లా కో- ఆర్డినేటర్ గా భువనగిరి పట్టణానికి చెందిన కొడారి వెంకటేష్ ను నియమించినట్లు జవహర్ బాల్ మంచ్ (జే బి ఎం) రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలల హక్కులను కాపాడుటకు, భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న జాతీయ నాయకుల జీవిత చరిత్రను సమగ్రంగా నేటి బాలలకు అందించటానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జిల్లా జవహర్ బాల్ మంచ్ కో- ఆర్డినేటర్ కొడారి వెంకటేష్ మాట్లాడుతూ తనను జిల్లా కో- ఆర్డినేటర్ గా నియమించిన జవహర్ బాల్ మంచ్ జాతీయ కన్వీనర్ అశోక్ మరిదాస్, రాష్ట్ర కో- ఆర్డినేటర్ చెరుకు కిరణ్ కుమార్, రాష్ట్ర చైర్మన్ మామిడి రుషికేశ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులకు కొడారి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.

VijayaKumar

Apr 16 2024, 17:53

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిశాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో ముద్దపురం యంపిటిసి సామ రాం రెడ్డి, మాజీ సర్పంచ్ ఉప్పల్ రెడ్డి,జక్క నర్మద వెంకట్ రెడ్డి,చంద్రారెడ్డి,గూడూరు యాదిరెడ్డి,గుర్ర క్రిష్నారెడ్డి,వాకిటి కోండల్ రెడ్డి,గుంటోదు మదనాచారి,ఆవుల దర్మయ్య,కొంపల్లి లక్ష్మయ్య,సామ దర్మారెడ్డి,జక్కమల్లారెడ్డి,సామ సంతోష వెంకట్ రెడ్డి,పిన్నింటి క్రిష్నారెడ్డి,పిన్నింటి వెంకట్ రెడ్డి,మొగిలిచెర్ల నవీన్,సామ దర్మారెడ్డి,కొంపల్లి లక్ష్మయ్య 50మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీతి రమేష్ వలిగోండ జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి,మండల అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి,గరిసె రవి,బోల్ల శ్రీనివాస్,కంకల కిష్టయ్య,బత్తిని సహదేవ్,పల్లెర్ల సుదాకర్,నిరజా రెడ్డి,కాసులవెంకటేష్,నారగోని ప్రమేద్ కుమార్,ప్రవీణ్,తదితరులు పాల్గోన్నారు.

VijayaKumar

Apr 16 2024, 17:41

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి పార్టీ జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ ఆవరణలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి  బీఎస్పీ పార్టీ జిల్లా ఇంన్చార్జ్ బండారు రవివర్ధన్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 

రిటైర్డ్ భువనగిరి మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో కొనసాగారు. ఆయన సేవలు బిఎస్పి పార్టీకి అందించారు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీ చేయుచున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, దర్లాయి హరిప్రసాద్, కొల్లూరి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండారు అశోక్ వర్ధన్,బుగ్గ మైసయ్య, 23వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కర్కాల సుదర్శన్ తోట మహేందర్ నువ్వుల రాజు ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Apr 15 2024, 17:31

వలిగొండ మండల కేంద్రంలో ఇంటింటికి బిజెపి ప్రచారం

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, బూత్ అధ్యక్షుడు ఎల్లంకి మురళి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్, మాటురి పెద కిట్టు , BJYM జిల్లా కార్య వర్గ సభ్యులు దంతూరి అరుణ్ ,ఏళ్లంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు

VijayaKumar

Apr 15 2024, 12:47

బీజేవైఎం భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా బుంగమట్ల మహేష్ నియామకం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన బుంగమట్ల మహేష్ కి భారతీయ జనతా యువమోర్చా భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ గా నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుంగమట్ల మహేష్ మాట్లాడుతూ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియామకానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి జిల్లా సీనియర్ నాయకుడు టెలికం అడ్వైజరీ బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య రాచకొండ కృష్ణ బచ్చు శ్రీనివాస్ ఇతర జిల్లా రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకంతో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ గా నియమించినందుకు భారతీయ జనతా పార్టీని బీజేవైఎం బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అదేవిధంగా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గేలుపే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.